Pak-Afghan Border Clash: పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య సరిహద్దులో కొనసాగుతున్న ఘర్షణల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి లేదా జోక్యం చేసుకోవడానికి ఆయన ప్రస్తుతానికి మొగ్గు చూపలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, అమెరికా తన దూరాన్ని పాటిస్తోందని ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also: Cargo Plane Crash: తరచుగా విమాన ప్రమాదాలు..మొన్న కొలంబియా నేడు బొలీవియా
షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్లపై ప్రశంసల వర్షం
అఫ్గనిస్థాన్పై దాడులు, ప్రస్తుత సంక్షోభం గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పాక్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. “నేను జోక్యం చేసుకోవచ్చు, కానీ అక్కడ గొప్ప ప్రధాని (షెహబాజ్ షరీఫ్) ఉన్నారు, గొప్ప జనరల్ (అసిమ్ మునీర్) ఉన్నారు. వారు ఇద్దరూ నేను నిజంగా గౌరవించే వ్యక్తులు. పాకిస్థాన్ ప్రస్తుతం అద్భుతంగా పని చేస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

అఫ్గన్తో బహిరంగ యుద్ధం ప్రారంభమైందన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ స్పందన వచ్చింది. కాబూల్, కాందహార్ సహా అఫ్గన్లోని 29 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో తాలిబన్లు, ఉగ్రవాదులు సహా 297 మంది హతమయ్యారని తెలిపింది. అయితే, అటు తాలిబన్ ప్రబుత్వం అధికార ప్రతినిధి జుబినుల్లాహ్ ముజాహిద్ సైతం తాము 55 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చామని, అనేక మందిని బందీలుగా పట్టుకున్నామని పేర్కొన్నారు.
అఫ్గన్లో తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంపై పాక్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే.శుక్రవారం దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. దురాక్రమణదారులను తమ బలగాలు అణిచివేయగలవని అన్నారు. ‘ఏదైనా దుందుడుకు చర్యలను అడ్డుకునే పూర్తి సామర్థ్యం మా దళాలకు ఉంది. పాకిస్థాన్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: