Telangana: తెలంగాణ విద్యా రంగంలో పెను మార్పులకు విద్యా కమిషన్ శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ (EAPCET) పరీక్షను తొలగించి, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసింది.
Read Also: MV Soundararajan: చిలుకూరు బాలాజీ అర్చకులు కన్నుమూత..

ఒత్తిడి లేని విద్యే లక్ష్యం
విద్యార్థులు చిన్న వయసులోనే పోటీ పరీక్షల పేరుతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యా కమిషన్ గుర్తించింది. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం 12వ తరగతి (ఇంటర్) ప్రతిభ ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు కేటాయించడం వల్ల విద్యార్థులకు ఊరట లభిస్తుందని కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక
ఈ కీలక ప్రతిపాదనలతో కూడిన సమగ్ర నివేదికను కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బలోపేతం మరియు ప్రవేశ పరీక్షల సంస్కరణలపై ఈ నివేదికలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదిస్తే, వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలంగాణలో ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: