हिन्दी | Epaper

Telangana MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

Anusha
Telangana MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

Telangana MLA Disqualification: తెలంగాణలో రాజకీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. శాసనసభాపతి కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపు న్యాయవాది హాజరయ్యారు. అయితే, దానం తరపున ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ తరపు న్యాయవాదులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పీకర్ ఈ విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.

Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

Telangana MLA Disqualification: Speaker to inquire into disqualification of MLAs
Telangana MLA Disqualification: Speaker to inquire into disqualification of MLAs

రేపు కడియం శ్రీహరి పిటిషన్లపై విచారణ

దానం నాగేందర్ కేసు వాయిదా పడగా, రేపు (శనివారం) మరో కీలక నేత కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిటిషన్లపై హైకోర్టు కూడా స్పందించిన నేపథ్యంలో, స్పీకర్ చేపడుతున్న ఈ వరుస విచారణలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ విచారణ ప్రక్రియ ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870