NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో పొందుపరిచిన కొన్ని వివాదాస్పద అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని చిన్న పిల్లల పాఠ్యప్రణాళికలో చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు న్యాయవ్యవస్థ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై ప్రతికూల భావన కలిగించే అంశాలను ఎందుకు బోధించాల్సి వచ్చిందని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పాఠ్యాంశాల రూపకల్పనలో జవాబుదారీతనం ఉండాలని, అసలు ఈ కంటెంట్ను ఎవరు పర్యవేక్షిస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులకు వ్యవస్థల పట్ల గౌరవం పెంచే విధంగా విద్య ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Deputy Speaker Raghurama Krishna Raju : ఏపీ డిప్యూటీ స్పీకర్ కు గాయాలు
ఈ వివాదాస్పద అంశంపై ఇప్పటికే న్యాయరంగంలో కూడా తీవ్ర చర్చ నడిచింది. పాఠ్యపుస్తకంలోని ఈ భాగం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని భావించి, గతంలోనే గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సదరు పాఠ్యాంశాన్ని నిషేధించడం గమనార్హం. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తూ, విద్యార్థులకు వాస్తవాలతో కూడిన నిర్మాణాత్మక జ్ఞానాన్ని అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పీఎంవో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ప్రతికూల అంశాలను మాత్రమే హైలైట్ చేయడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లల మనస్తత్వం ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్సీఈఆర్టీ (NCERT) పుస్తకాల్లో భవిష్యత్తులో మరిన్ని మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :