हिन्दी | Epaper

South Central Railway: గోదావరి పుష్కరాలకు ముందస్తుగా రైల్వే పనులు

Saritha
South Central Railway: గోదావరి పుష్కరాలకు ముందస్తుగా రైల్వే పనులు

రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో 28.27 కోట్లుకు టెండర్లు

South Central Railway: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలను (Godavari Pushkarala) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టారు. దీనికి ముందస్తుగా రైల్వే శాఖ పుష్కరాలకు ప్రయాణికుల అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న పుష్కరాలకు రైల్వే అధికారులు రూ.28.87 కోట్లతో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీచేసింది.

Read Also: Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష

South Central Railway: గోదావరి పుష్కరాలకు ముందస్తుగా రైల్వే పనులు
South Central Railway: Railway work in advance of Godavari Pushkaram

మౌళిక సదుపాయాల కల్పన

విజయవాడ-రాజమండ్రి రైల్వే సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. మార్చి 20న టెండర్లకు చివరి గడువుగా నిర్ణయించారు. కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో వివిధ ప్లాట్ఫారాలలో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిధులను కేటాయించారు. ప్రధానంగా అదనపు బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లు, తాగునీరు, స్టేషన్లో యార్డుల అభివృద్ధి, శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు పనులు చేపడతారు. ఈ పనులన్నీ 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్ సిద్ధం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870