భారతదేశంలో రైల్వే ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభవం. ముఖ్యంగా దక్షిణాది నుంచి ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఒక అదిరిపోయే వార్తను అందించింది. బెంగళూరు (Bengaluru) నుంచి వారణాసి (Varanasi) వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 292 కిలోమీటర్ల మేర దూరం తగ్గబోతుండటం ఈ ప్రాజెక్టు విశేషం. గొండియా – జబల్పూర్ లైన్ డబ్లింగ్తో సరికొత్త విప్లవం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్లే ‘గొండియా- జబల్పూర్’ రైల్వే లైన్ ను డబ్లింగ్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 231 కిలోమీటర్ల పొడవున్న ఈ సెక్షన్ కోసం రూ. 5,236 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే.. వారణాసి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు అత్యంత తక్కువ దూరంలో ఉండే రైల్వే మార్గం అందుబాటులోకి వస్తుంది.
Read Also: Venezuela Oil: గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

బెంగళూరు నుంచి వారణాసికి..
300 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం ప్రస్తుతం బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అయితే ఈ కొత్త డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రయాణ దూరంలో దాదాపు 292 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం కూడా చాలా గంటల మేర ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ మార్గంలో మరో 35 కొత్త ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్, మెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇది సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం ఇక సులభం ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణా కోసమే కాదు, ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా పెద్దపీట వేస్తోంది. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల రామేశ్వరం, మధురై, అయోధ్య ధామ్, వారణాసి, ప్రయాగరాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. దక్షిణాది నుంచి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: