Palamaner: చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాతవపేటకు చెందిన విశ్వనాథ్ అనే యువకుడు గురువారం ఉదయం స్థానిక జిమ్కు వెళ్లి వ్యాయామం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శారీరక శ్రమ చేస్తున్న సమయంలోనే ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. జిమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన, బయట వాంతులు చేసుకుని గుండెపోటుతో మృతి చెందాడు.
Read Also: Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభం!

ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది
జిమ్లో సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం, రికవరీ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విశ్వనాథ్ డీసీసీ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు.
వ్యాయామం చేసేవారు జాగ్రత్త!
ఇటీవలి కాలంలో జిమ్లలో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతి తక్కువ సమయంలో బాడీ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో చేసే కఠినమైన వర్కౌట్లు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగుల వంటి ఒత్తిడితో కూడిన వృత్తిలో ఉండేవారు, వ్యాయామానికి ముందు కనీస పరీక్షలు చేయించుకోవడం, నిపుణుల సమక్షంలోనే శిక్షణ తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: