BRS Party: కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘోర ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రెండు నెలల పసిపాప మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్లో ప్రత్యక్షంగా నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి అండగా కేటీఆర్ దీక్షలో కూర్చున్నారు. ఈ పర్యటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Read also: SLBC Accident: మృతదేహాల వెలికితీతలో వైఫల్యం:కేటీఆర్

KTR fights alongside victims in Nagarkurnool
పసిపాప మృతి.. కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు
జాతరలో జరిగిన గొడవలో కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి వల్లే చాకలి చంద్రకళ అనే మహిళకు చెందిన రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్షతోనే తమపై ఈ దాడి జరిగిందని, పసిపాప ప్రాణాలు పోయినా కనికరం చూపలేదని వారు బాధపడ్డారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, అధికార పార్టీ అండతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
బాధితులపైనే రివర్స్ కేసులు.. కేటీఆర్ డిమాండ్
కుటుంబాన్ని కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, పోలీసులు వారిపైనే అక్రమ కేసులు పెట్టడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: