TSRTC Strike: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె ముప్పు కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వ విభాగంలో విలీనం చేయడం, జీతాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల వంటి కీలక డిమాండ్లపై కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
Read Also: Numaish Exhibition: ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్

ఇందిరా పార్క్లో భారీ ధర్నా
కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మార్చి 13 డెడ్లైన్, మార్చి 18 తర్వాత సమ్మె
మార్చి 13లోపు సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె నోటీసు ఇచ్చి, మార్చి 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని కార్మిక నేతలు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: