हिन्दी | Epaper

AP: పింఛన్‌ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ

Saritha
AP: పింఛన్‌ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ఇచ్చే పింఛన్లను, ఈసారి ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) వెల్లడించారు.

Read Also: APSRTC Free Bus: ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

AP: పింఛన్‌ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ

కొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే

ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,76,322 మంది పింఛనుదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 2725.79 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా కొత్తగా మంజూరైన 8,977 మంది వితంతు పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ నెల నుంచే పింఛను అందనుంది. వీరి కోసం అదనంగా రూ. 3.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఫిబ్రవరి 28న పింఛను అందుకోలేకపోయిన వారికి, మిగిలిన వారికి మార్చి 2వ తేదీన సచివాలయ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి పంపిణీ పూర్తి చేస్తారని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ. 57,808.68 కోట్లు ఖర్చు చేసిందని, ఇది సామాజిక భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870