బ్రెజిల్ దేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మినాస్ గెరైస్ (Minas Gerais) రాష్ట్రంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 584MM వర్షపాతం నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతటి భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జుయిజ్ డిఫోరా మరియు ఉబా వంటి ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
MLC Anantha Babu: నేను పరారీలో లేను: అనంతబాబు
కేవలం వరదలే కాకుండా, వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం (Landslides) తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 39 మంది గల్లంతయ్యారు. మట్టి దిబ్బల కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 200 మందికి పైగా బాధితులను విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.

ఈ విపత్తుపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, తక్షణ సహాయ నిధిని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం, మందులు అందజేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి అసాధారణ వర్షపాతం నమోదవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు తగ్గుముఖం పడితే తప్ప ఆస్తి నష్టం అంచనా వేయడం కష్టమని అధికారులు తెలుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com