Speed post night booking : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. India Post రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో 24 గంటల స్పీడ్ పోస్ట్ మరియు పార్శిల్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రజలు రాత్రింబవళ్లు ఎప్పుడైనా పోస్టల్ సేవలను వినియోగించుకునే అవకాశం కలిగింది.
తొలి దశలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు మరియు గుంతకల్లు నగరాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అత్యవసరంగా పత్రాలు, అధికారిక డాక్యుమెంట్లు లేదా పార్శిళ్లు పంపాల్సిన వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
Read Also: HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 242 ప్రధాన పట్టణాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల పనివేళలను 1 నుంచి 2 గంటల వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఐటీ 2.0 సాఫ్ట్వేర్ అమలు చేయడంతో పోస్టల్ సేవలు మరింత స్మార్ట్గా మారాయని, సాంకేతిక ఆధునికీకరణలో భాగంగానే సేవల విస్తరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో తపాలా శాఖ ముందుకు సాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: