ఆధునీకరించిన కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ను ఆంత్రోపిక్ ఏఐ సోమవారం మార్కెట్లోకి వదిలింది. ఐబీఎం కంప్యూటర్లలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజీగా దీన్ని విరివిగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక ట్రాన్సాక్షన్ల కోసం ఐబీఎం కొన్నేళ్ల నుంచి కోబాల్తో ఉన్న కంప్యూటర్లను విక్రయిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఐబీఎం షేర్లు 27 శాతం కుప్పకూలిన విషయం తెలిసిందే. 1968 తరువాత కంపెనీ చరిత్రలో ఇంత దారుణంగా షేర్లు పడిపోవడం ఇదే ప్రథమం అని అప్పట్లో యాజమాన్యం ప్రకటించింది. ఫైనాన్స్, ఎయిర్లైన్స్, గవర్నమెంట్ వ్యవస్థల్లో ప్రతినిత్యం కోబాల్ ఒక టూల్ గా మారిందని ఆంత్రోపిక్ సోమవారం తన పోస్టులో వెల్లడించింది. క్లాడ్ కోడ్తో కోబాల్ను మరింత వేగంగా పనిచేసేలా చేస్తుందని పేర్కొంది. టెక్ నిపుణులు నెలల పాటు పనిచేసే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు ఆంత్రోపిక్ స్పష్టం చేసింది. ఆంత్రోపిక్(Anthropic) సోమవారం విడుదల చేసిన క్లాడ్ కోడ్ తో ఐబీఎం పై ప్రత్యక్షంగా ప్రభావం చూపించింది.
Read Also: UP Fire Accident: నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

అంతర్జాతీయ మార్కెట్లను ఇప్పుడు ఆర్టిఫిలిఒఉవుడులనషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భయం ఇప్పుడు వణికిస్తున్నది. గత ఫిబ్రవరి నెలలో ఆంత్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోడ్ సెక్యురిటీ టూల్ తో పలు కంపెనీలు షేర్లు న్యూయార్క్ సిటీలోని నాస్డాక్ ఎలక్ట్రానిక్ స్టాక్ మార్కెట్లో ఊగిసలాడాయి. సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ రంగంలో పేరొందిన కంపెనీల షేర్లు పడిపోయాయి. అమెరిక్ మార్కెట్లో 285 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి అయిపోయింది. ఒక్కరోజే సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ సర్వీసులు, అసెట్ మేనేజ్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలకు రూ.24 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: