MohanBabu University: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలకలం రేపింది.
Read also:Amberpet Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!

ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించడంతో వారు యూనివర్సిటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: