Tiger: ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. పోలవరం జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో మరోసారి పులి సంచరిస్తుండటం స్థానిక గిరిజన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల అటవీ శాఖ అధికారులు (Forest Department) పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టిన పులే మళ్లీ జనావాసాల వైపు వస్తుండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఈ పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించి, నిఘా ముమ్మరం చేశారు.
Read also: Rajahmundry Milk Adulteration: కల్తీ పాలలో యూరియా?

గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేస్తూ హడలెత్తించిన ఈ పులిని ఈ నెల మొదటి వారంలో అటవీ అధికారులు అతికష్టం మీద బంధించారు. విశాఖ జూలో చికిత్స అనంతరం, ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు దీనిని పాపికొండలు అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే, పది రోజుల వ్యవధిలోనే అది మళ్లీ గ్రామాల సమీపంలోకి రావడం గమనార్హం.
వదిలిన పది రోజుల్లోనే ఈ పులి మళ్లీ జనావాసాల సమీపంలోకి వచ్చింది. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెం అటవీ ప్రాంతాలతో పాటు మారేడుమిల్లి పరిధిలోని పలు గ్రామాలకు సమీపంలో సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులి సంచారంతో అటవీ శాఖ నిఘా పెంచింది. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: