CM Chandrababu Vizianagaram Visit: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురుపల్లి మండలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో, రావివలస సమీపంలోని పైలపేట వద్ద ప్రతిపాదిత బహిరంగ సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
సభా ప్రాంతానికి సంబంధించిన మ్యాపులను పరిశీలించిన కలెక్టర్, గ్రామ సమీపంలోని లేఅవుట్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ఏఎస్పీ సౌమ్యలతతో చర్చించారు. అలాగే, సభా ప్రాంగణానికి కలుపుతూ నిర్మాణంలో ఉన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

పాల్గొన్న ముఖ్య అధికారులు
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీల గాంధీ, పి.ఆర్. ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్ఈ కాంతిమతితో పాటు రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖల అధికారులు మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: