AP: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ (SIT) విచారణ, తదుపరి పరిణామాలు చోటుచేసుకోగా, ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిటీని కూడా నియమించింది. ఈ క్రమంలో, తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రేపు అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. రేపు శాసనసభలో లడ్డూ వివాదంపై సమగ్ర చర్చ జరగనుంది.
అసెంబ్లీలో లడ్డూ వివాదంపై చర్చ జరగనున్న సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా, రేపటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: TTD Laddu Case: లడ్డూ కేసు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

పులివెందుల పర్యటన
రేపు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో జగన్ ప్రజాదర్భార్ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని తెలిపింది. అలాగే ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారని, అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: