TPCC Chief: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు స్పష్టమైంది. పెళ్లి పనులు ప్రారంభించిన కుటుంబ సభ్యులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేసే ప్రక్రియను మొదలుపెట్టారు.
సోమవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో విజయ్ దేవరకొండ బాబాయి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్, రష్మికల వివాహానికి రావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేఖను అందజేశారు.
Read Also: Vijay Deverakonda-Rashmika: ఉదయ్పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక

ఆహ్వానాన్ని స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్, త్వరలో ఒక్కటి కాబోతున్న నూతన జంటకు తన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాలు అందజేయడం ప్రారంభం కావడంతో, త్వరలోనే వివాహ తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: