हिन्दी | Epaper

Tirumala laddu case: అసెంబ్లీలో లడ్డూ కల్తీ వాస్తవాలు వెల్లడిస్తాం: నారా లోకేశ్

Tejaswini Y
Tirumala laddu case: అసెంబ్లీలో లడ్డూ కల్తీ వాస్తవాలు వెల్లడిస్తాం: నారా లోకేశ్

Tirumala laddu case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం శాసనసభలో వెల్లడించనుంది. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్, ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also:AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్

Tirumala laddu case: We will reveal the facts of laddu adulteration in the Assembly: Nara Lokesh
Tirumala laddu case: We will reveal the facts of laddu adulteration in the Assembly: Nara Lokesh

సభలో వాస్తవాల వెల్లడి

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాస్తవాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి(Nara Lokesh) తెలిపారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామికి జరిగిన ఈ మహాపచారాన్ని ఆధారాలతో సహా చట్టసభ వేదికగానే ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ వైఖరిపై విమర్శలు

సభకు హాజరుకావడం ప్రజాప్రతినిధులుగా వైసీపీ ఎమ్మెల్యేల కనీస బాధ్యత అని లోకేశ్ గుర్తుచేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి, ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తిని రాజకీయం చేయడం ఆక్షేపణీయమని హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870