
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు రోజుల విరామం తర్వాత ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యుల నిరసనలతో గందరగోళం నెలకొంది.
Read Also:AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్
హెరిటేజ్ – ఇందాపూర్ డైరీలపై చర్చకు పట్టు
ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందాపూర్ మరియు హెరిటేజ్ డైరీల వ్యవహారాలపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, మండలి చైర్మన్ మోషేన్ రాజు ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుస నినాదాలు.. కొద్దిసేపు వాయిదా
చైర్మన్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. చైర్మన్ పదేపదే సభ్యులను సముదాయించి, తమ స్థానాలకు వెళ్లాలని సూచించినప్పటికీ ఆందోళన తగ్గకపోవడంతో, సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: