Bangladesh Cricket:బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపిన ఘటనలో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మంజురుల్ ఇస్లాంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతనిపై తక్షణ నిషేధం విధిస్తూ, బోర్డు పరిధిలో జరిగే ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: India vs South africa : మిల్లర్ మెరుపులు, భారత్ ముందు 188 పరుగుల భారీ లక్ష్యం
నాలుగు ఆరోపణలపై కమిటీ విచారణ జరిపింది
బంగ్లాదేశ్ మాజీ మహిళా కెప్టెన్ జహనారా ఆలం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన స్వతంత్ర కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీసీబీ తెలిపింది. 2022 ప్రపంచ కప్ సమయంలో మంజురుల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జహనారా ఆరోపించింది.జహనారా చేసిన నాలుగు ఆరోపణలపై కమిటీ విచారణ జరిపింది. వీటిలో రెండింటికి సరైన ఆధారాలు లభించనప్పటికీ, మిగిలిన రెండింటిలో మంజురుల్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కమిటీ తేల్చింది.

గతంలో మహిళల జట్టు సెలెక్టర్గా, మేనేజర్గా పనిచేసిన మంజురుల్ కాంట్రాక్ట్ 2025 జూన్ 30తో ముగిసింది. అతని ప్రవర్తన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది వేధింపుల కిందకే వస్తుందని కమిటీ పేర్కొంది.ఇదే సమావేశంలో, తొలిసారిగా నిర్వహించనున్న మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూబీపీఎల్) షెడ్యూల్కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ టోర్నీ 2026 ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఢాకా, ఛటోగ్రామ్ వేదికలుగా జరగనుంది. అలాగే, జాతీయ సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ గాజీ అష్రాఫ్ హుస్సేన్ పదవీకాలాన్ని మరో నెల పొడిగించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: