Surya-Abhishek: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ కీలక దశలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్పై చర్చ నడుస్తున్న తరుణంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనికి బహిరంగంగా పూర్తి మద్దతు ప్రకటించాడు. జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు ఎవ్వరూ అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశాడు.
Read Also: Pak vs NZ T20 Rain Delay : సూపర్-8 మ్యాచ్కు వర్షం అడ్డంకి, టాస్ గెలిచిన పాకిస్థాన్

మేము తన కోసం నిలబడతాం
ఆదివారం జరగనున్న మ్యాచ్కు ముందు విలేకరులతో మాట్లాడిన సూర్యకుమార్.. “అభిషేక్ ఫామ్ గురించి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, వాళ్లను చూస్తేనే నాకు ఆందోళనగా ఉంది. అతను ఇంకా పరుగులు చేయలేదంటే, తర్వాతి మ్యాచ్లలో ప్రత్యర్థి జట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఇది టీమ్ గేమ్. ఏడాది కాలంగా మా అందరి బాధ్యత తను తీసుకున్నాడు, ఇప్పుడు మేము తన కోసం నిలబడతాం. ఒకవేళ అతను విఫలమైతే, ఆ లోటును భర్తీ చేయడానికి మేమున్నాం” అని స్పష్టం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: