AI Summit: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఏ ఐ సమ్మిట్ లో జరిగిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బి జే వై ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది.శనివారం ఉదయం తిరుపతి లో నాలుగు కాళ్ళ మండపం వద్ద నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిని అడ్డుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించడం తీవ్రంగా ఖండించబడింది.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రుధ్వి మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత స్పష్టమైన తీర్పు ఇస్తారని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కృషిని అడ్డుకోవాలనే ఏ ప్రయత్నమైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి జే వై ఎం జిల్లా అధ్యక్షుడు పార్థు, రాష్ట్ర స్పోర్ట్స్ ,గేమ్స్ కన్వీనర్ జీవన్ రాయల్, శరత్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ గౌరవం, యువత భవిష్యత్తు, భారత అభివృద్ధి కోసం BJYM కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: