Machilipatnam Crime: ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక గిరీశ్ కుమార్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Also: Vizag News: కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

అప్పు తీర్చలేదని వేధింపులు
మచిలీపట్నం కాసానిగూడెంకు చెందిన ఈడే గిరీశ్ కుమార్, స్థానిక బెల్ (BEL) కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా కొంత నగదును అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల సదరు రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ ప్రతినిధులు గిరీశ్ కుమార్ ఫోన్ నంబర్కు, అతడి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి అసభ్యకర సందేశాలు పంపుతూ మానసికంగా వేధించడం మొదలుపెట్టారు.
బంధువుల ఆవేదన.. దర్యాప్తులో పోలీసులు
నిర్వాహకుల వేధింపులు మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరీశ్, ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఏ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు? వేధింపులకు పాల్పడిన వారు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: