SLBC Accident: తెలంగాణలోని SLBC సొరంగం కూలి ఏడాది గడుస్తున్నప్పటికీ, కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని BRS నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
Read Also:Ayesha Meera murder case closed: ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

మృతదేహాల వెలికితీతలోనూ, సొరంగం పనుల్లోనూ ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు కమిషన్లపై పెట్టే శ్రద్ధను ప్రజల శ్రేయస్సుపై పెట్టితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావని ఆయన వ్యాఖ్యానించారు. 2025 ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలిన ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారని సమాచారం. మిగిలిన మృతదేహాల వెలికితీత కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: