Tirumala Child Kidnap Case: ఈ నెల 16వ తేదీన తిరుమలలోని నాదనీరాజనం ప్రాంతంలో నవదుర్గ (05), అశ్విని (03) అనే ఇద్దరు బాలికలు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు, జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిసిటివి ఫుటేజీలు మరియు సాక్షుల సమాచారం ఆధారంగా నిందితురాలు అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన గుండ్లూరు శివమ్మ (42) అని గుర్తించారు.
Read Also: Tirupathi : శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ
కొవ్వూరులో దొరికిన నిందితురాలు – చిన్నారుల రక్షణ
నిందితురాలు శివమ్మ చిన్నారులను తిరుమల నుండి తిరుపతి మీదుగా రైలులో రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లింది. తిరుమల పోలీసుల సమాచారం మేరకు అప్రమత్తమైన రైల్వే పోలీసులు, 17వ తేదీన కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారులను రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి తరలించగా, నిందితురాలిని మహిళా హోంకు పంపారు. నిందితురాలిని విచారించగా, సులభంగా డబ్బు సంపాదించేందుకు చిన్నారులతో బలవంతంగా భిక్షాటన చేయించాలనే ఉద్దేశంతోనే అపహరించినట్లు నేరాన్ని అంగీకరించింది.
Tirumala Child Kidnap Case: తల్లిదండ్రులకు అప్పగింత – పోలీసుల సూచనలు
పట్టుబడిన నిందితురాలు శివమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, తిరుపతి సి.డబ్ల్యు.సి (CWC) ద్వారా వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మవద్దని సూచించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన సిఐ రాముడు, ఎస్ఐలు రమేశ్ బాబు, చలపతి, నరేష్లను ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: