
Gadwal Bus Accident: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇటిక్యాలపాడు సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాద(Accident) సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read also: Kazipet Accident: శివాజీ శోభాయాత్రలో విద్యుదాఘాతం
వివరాల్లోకి వెళితే
ప్రమాద తీవ్రతకు బస్సు పైకప్పు మరియు కిటికీలు ధ్వంసం కావడంతో లోపల ఉన్న వారు బయటకు రాలేక నరకయాతన అనుభవించారు. ఈ ప్రమాదంలో స్నేహలత, రంగన్న, శివ, వీరేశ్, సుబ్బారాయుడు, అరుణ, మోహన్, రామేశ్వరమ్మ, గౌస్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నప్పటికీ, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ నిర్లక్ష్యపు ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: