TG Crime:తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసుల వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29), తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ లో అద్దె ఇంటిలోకి మారారు. అయితే భర్త నరేష్, అత్తమామలు కట్నం కోసం మమతను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: