
Kulavardhan Death: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ మృతదేహం ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథగా పడి ఉంది. చెరువులో ఆత్మహత్య చేసుకున్న అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు బంధువులు ఎవరూ ముందుకు రావడం లేదు. నిందితుడి ఘాతుకాన్ని నిరసిస్తూ అతని సొంత కుటుంబం కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంది.
Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్
అంత్యక్రియలకు మున్సిపల్ సిద్ధం
తన కొడుకు చేసిన పాపానికి అతన్ని చూసేందుకు కూడా తల్లి నిరాకరించగా, తమకు ఎలాంటి సంబంధం లేదని సోదరి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నిందితుడి మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ద్వారానే అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజికంగా ఎదురవుతున్న ఆగ్రహావేశాల దృష్ట్యా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: