Pilot training India aviation : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి & ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో “చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్” సంస్థను ప్రారంభించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగానికి ప్రపంచ స్థాయి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న లోకేశ్, సంస్థ కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటా పర్యటన సందర్భంగా ఈ సంస్థ ఏర్పాటు ఆలోచన తనకు వచ్చిందని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చడం సంతోషకరమని తెలిపారు. దేశ విమానయాన రంగ అభివృద్ధికి అవసరమైన ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Phone Pay: ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం

ప్రారంభోత్సవం అనంతరం ఢిల్లీ విమానాశ్రయం పరిసరాల్లో యువ పైలట్ క్యాడెట్లతో జరిగిన పరస్పర చర్చా కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. యువతలో ఉన్న నైపుణ్యం, ఆసక్తి భారత విమానయాన రంగ భవిష్యత్తుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. క్యాడెట్లతో సంభాషణ తనకు ప్రేరణనిచ్చిందని, ఈ సంస్థ ద్వారా దేశ విమానయాన రంగానికి కొత్త దిశ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: