న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026(AI Impact Summit) నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, వాటి ప్రభావాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు ఐదు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉద్యోగాల అంతరాయం నుంచి పిల్లల భద్రత వరకు అనేక కీలక అంశాలు ఈ సమ్మిట్ అజెండాలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ AI ఇంపాక్ట్ సమ్మిట్ను నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా.. ప్రపంచ AI పాలన, సహకారం కోసం భాగస్వామ్య రోడ్మ్యాప్”ను ప్రకటించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
Read Also: Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్లో తులం ఎంత?

AI రంగంలో విధానాలు, పెట్టుబడులపై చర్చలు
ఈ ఎక్స్పోలో ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు ఒకే వేదికపైకి రానున్నారు. AI రంగంలో తాజా ఆవిష్కరణలు, విధానాలు, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 13 దేశాలకు చెందిన పెవిలియన్లు ఏర్పాటు చేయగా.. ఇవి అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్తో పాటు ఆఫ్రికా దేశాల పెవిలియన్లు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి 30కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారని అంచనా.
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ఒక వేదికగా
ప్రపంచ AI పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను బలంగా వినిపించేందుకు ఈ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని భారత అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ స్థాయి గ్లోబల్ AI సమ్మిట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సమ్మిట్లో ముఖ్య వక్తలుగా సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్మాన్, డారియో అమోడీ, ముఖేష్ అంబానీ,డెమిస్ హస్సాబిస్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ అంతర్జాతీయ AI సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను హై అలర్ట్ చేశారు. భారత్ మండపం పరిసర ప్రాంతాల్లో 10 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: