పుల్వామా ఉగ్రదాడి జరిగి 2026 ఫిబ్రవరి 14 నాటికి ఏడేళ్లు పూర్తయ్యాయి.ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అమరవీరులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయని, వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధాని మోదీ (PM Modi On Pulwama Attack) అన్నారు.
Read Also: Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి
ఏడుగురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు
2019లో పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. నాడు ఆ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ 2020లో 18 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో ఏడుగురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. వీరు పాకిస్థానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు అభియోగాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: