దేశంలో ధరల పెరుగుదల అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జనవరి నెలకు సంబంధించిన గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. గత నెలలతో పోలిస్తే ఇది కొంత నియంత్రణలో ఉన్నట్లుగా కనిపించినా, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు (Price Rise) సామాన్యుడిపై భారంగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, లోహాలు, నిత్యావసర వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ప్రజల ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయి.
Read Also: Online: ఇపాస్పోర్ట్ తో సులభంగా పాస్పోర్ట్ పొందవచ్చు

గణాంకాలు విడుదల
రాష్ట్రాల వారీగా తెలంగాణలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: