తిరువతి : ఉద్యోగాలు పేరుతో ఐపిఎస్ అధికారినంటూ నిరుద్యోగులను మోసంచేసిన నకిలీ ఐపిఎసన్ను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను దోచుకుంటున్న ఒక ఘరానా మోసగాడిని పట్టుకోవడంతో సంచలనం కలిగించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) లో ఐపిఎస్(Fake IPS Officer) అధికారి పేరుతో కె. సురేష్ కుమార్ అనే సూర్య ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు సురేష్ కుమార్ తనను తాను ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటూ ప్రజలను నమ్మించేవాడు. ఈ క్రమంలో ఒక రాపిడో డ్రైవర్కు ఎర వేశాడు.
Read Also: Andhra Pradesh: ‘భూముల’బిల్లుకు కేబినెట్ ఓకే

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో
ఆదాయపన్ను శాఖలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, తనకు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికాడు. నమ్మిన డ్రైవర్ ఉద్యోగం కోసం 1.50 లక్షల రూపాయలును సురేష్కు అందించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అలిపిరి సిఐ పివిఎస్ రామకిశోర్ సిబ్బంది సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి, కటకటాల్లోకి నెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, నకిలీ గుర్తింపు కార్డులతో మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయాలని విజప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: