అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూలు (Kurnool) విద్యార్ధిని కందుల జాహ్నవి (jaahnavi) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె చావుకు పోలీసులు కారణమైనందున అమెరికా చట్టాల ప్రకారం భారీ పరిహారం చెల్లించాలని ఆమె తల్లితండ్రులు చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది.
Read Also: US : ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం..
2021లో అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి.. 2023 జనవరి 23న సియాటిల్ లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్నవి (jaahnavi) అక్కడికక్కడే చనిపోయింది. వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే ఆమె ఓ సాధారణ వ్యక్తి, “ఈ మరణానికి విలువ లేదు” అని కామెంట్ చేసి వివాదం సృష్టించాడు. ఘటనపై అమెరికాలో విమర్శలు వచ్చాయి. కెవిన్ విధుల నుంచి తొలగించబడ్డాడు.
ఆ వ్యాఖ్యలపై భారత్ కూడా నిరసన తెలిపింది. ఆమె తల్లితండ్రులు న్యాయపోరాటం చేశారు. చివరికి దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం.. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించి కేసు సెటిల్ చేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సెటిల్మెంట్ తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం దక్కుతుందని స్థానిక అటార్నీ ఈ ప్రకటనలో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: