Central Government DBT: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు బియ్యం సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. సరుకులకు బదులుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేసేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది.
Read Also: APMIP Services : రైతులకు వాట్సాప్ లో APMIP సేవలు – అచ్చెన్న
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానం
అక్రమాలను నివారించేందుకు కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ పద్ధతి ద్వారా బియ్యానికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. దీనివల్ల నకిలీ రేషన్ కార్డుల వినియోగం తగ్గడమే కాకుండా, బియ్యం పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం విశ్వసిస్తోంది.
Central Government DBT: బ్లాక్ మార్కెట్కు చెక్
రేషన్ బియ్యం తరచుగా బ్లాక్ మార్కెట్కు తరలిపోవడం, అర్హులైన వారికి నాణ్యమైన సరుకులు అందకపోవడం వంటి సమస్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే బియ్యం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే నగదుతో తమకు నచ్చిన నాణ్యమైన వస్తువులను మార్కెట్లో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది.
లబ్ధిదారులకు స్వేచ్ఛ మరియు పారదర్శకత
ఈ కొత్త విధానం వల్ల లబ్ధిదారులు కేవలం ప్రభుత్వం ఇచ్చే బియ్యంపైనే ఆధారపడకుండా, తమ అవసరాలకు తగినట్లుగా ఆహార ధాన్యాలను ఎంచుకోవచ్చు. పంపిణీ వ్యవస్థలోని మధ్యవర్తుల ప్రమేయం ఉండదు కాబట్టి, ప్రతి పైసా నేరుగా సామాన్యుడి అకౌంట్కు చేరుతుంది. తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) మరింత బలోపేతం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: