Siddipet crime: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన బోనాల నవ్య(18), నారాయణరావుపేట మండలానికి చెందిన మాదన్నగారి శ్రావణ్(21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వరుసకు బావ మరదలు అవుతారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్లు సమాచారం.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

సమాచారం అందుకున్న పోలీసులు
అయితే, సోమవారం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఈ జంట ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: