H1B visa news : అమెరికా వెళ్లాలనుకునే ఐటీ నిపుణులకు శుభవార్త. ట్రంప్ సర్కార్ ఇటీవల హెచ్1బీ వీసాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసినప్పటికీ, టెక్ కంపెనీల డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఏఐ (Artificial Intelligence) రంగంలో వేగంగా పెరుగుతున్న అవసరాల కారణంగా విదేశీ టాలెంట్పైనే అమెరికన్ కంపెనీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
హెచ్1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్ల వరకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో విదేశీ నియామకాలను తగ్గించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రముఖ టెక్ సంస్థలు హెచ్1బీ వీసాదారుల నియామకాల్లో వెనకడుగు వేయడం లేదు.
Read Also: AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త హెచ్1బీ వీసాల కోసం దాఖలైన లేబర్ కండీషన్ అప్లికేషన్లలో 80 శాతానికి పైగా ఏఐ రంగానికి సంబంధించినవే. సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సైంటిస్టుల కోసం పెద్ద ఎత్తున విదేశీ నిపుణులను నియమించుకుంటున్నట్లు వెల్లడించింది.
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు 2025లో ఏఐ రంగంపై సుమారు 380 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. భవిష్యత్తులో ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలోనే భారీ వీసా ఫీజులు ఉన్నప్పటికీ, హెచ్1బీ వీసాల ద్వారా విదేశీ ప్రతిభను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: