భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.. దశాబ్దాల నాటి మిత్రదేశం రష్యా(russia)ను అంత తేలిగ్గా ఎందుకు మన దేశం వదిలేసుకుంటోందని. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా భారత్ లో ప్రభుత్వాలు మారుతున్నా నిరాటంకంగా సాగిన రష్యా చమురు దిగుమతుల్ని ఇప్పుడు ట్రంప్ మాట విని మోడీ హఠాత్తుగా రాత్రికి రాత్రి నిలిపేస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. భారత్ కు రష్యా చమురు గతంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలుపెట్టాక ఆర్ధిక ఇబ్బందుల్లో పడింది. దీంతో అప్పటికే భారత్ కు విక్రయిస్తున్న చమురు సరఫరాను మరింత పెంచుకునేందుకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. వీటిని భారత్ కూడా అంగీకరించి భారీ ఎత్తున ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. ఇది కాస్తా అమెరికాకు మంటపుట్టించింది. దీంతో రష్యా నుంచి భారీ డిస్కౌంట్ తో ఆయిల్ కొంటూ ఉక్రెయిన్ యుద్దానికి ఊతమిస్తున్నారంటూ భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు.
Read Also: Jeevan Rao: ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

భారత్ ప్రస్తుతానికి మధ్యేమార్గం అనుసరించే అవకాశం
అయితే ఇప్పుడు తాజాగా కుదిరిన డీల్ ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల్ని భారత్ అపేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే తప్పనిసరిగా ట్రంప్ చెప్పిన వెనెజులా నుంచి ఖరీదైన చమురు కొనాల్సి ఉంటుంది. దీంతో ఈ విషయంలో భారత్ ప్రస్తుతానికి మధ్యేమార్గం అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పై ముందుగానే సమాచారం ఉండటంతో రష్యాకు చమురు ఆర్డర్లను ఏప్రిల్ వరకూ కేంద్రం ఇచ్చేసింది. భారత్ వ్యూహమిదే..! వాస్తవానికి భారత్ తన ముడి చమురు అవసరాలలో 85-88 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. రష్యా ఇందులో ఎప్పుడూ కీలక సరఫరాదారుగా ఉంది. భారతీయ రిఫైనరీల అవసరాలకు సరిపోయే రాయితీ ధరలకు తరచుగా ముడి చమురును రష్యా అందిస్తోంది. అలాగే చమురు ఒప్పందాలు సాధారణంగా వారాల నుండి నెలల ముందుగానే జరుగుతాయి. భారతీయ రిఫైనరీలు ఇప్పటికే మార్చి లేదా ఏప్రిల్ వరకు రష్యా చమురును బుక్ చేసుకున్నాయి. ప్రభుత్వం కోరినా, ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలతో వెంటనే కొనుగోళ్లను నిలిపివేయడం సాధ్యం కాదు. అలాగే బుక్ చేసిన సరుకులను ఆర్థిక నష్టాలు, జరిమానాలు లేకుండా అంత తేలికగా రద్దు చేయడం కష్టం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: