బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన SIR ప్రక్రియను సవాల్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆమె ఆరోపించారు.
Read Also: Karnataka: భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

లక్షలాది ఓట్ల తొలగింపుపై అభ్యంతరం
SIR ప్రక్రియ ద్వారా బెంగాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విధానం వల్ల అర్హులైన పౌరులు తమ ప్రాథమిక హక్కును కోల్పోతున్నారని ఆమె వాదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
భారత న్యాయ చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ సీఎం స్వయంగా కోర్టుకు హాజరై న్యాయవాదిగా వాదనలు వినిపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని ‘దీదీ’ ధ్వజమెత్తారు. ఆమె వాదనలు విన్న సుప్రీంకోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ECIకి నోటీసులు జారీ చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: