గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికాకు.. భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం అస్సలు నచ్చలేదు. రష్యా వార్ మెషీన్కు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ (Trump) గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ప్రతికారంగా భారత ఉత్పత్తులపై ట్రంప్ అదనంగా 25% పన్నులు విధించారు. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరి భారత ఎగుమతిదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్లు తగ్గించిన ట్రంప్

మోదీ కోరిక మేరకే తాను పన్నులను 18 శాతానికి తగ్గించాం: ట్రంప్
ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం! సోమవారం రాత్రి ఈ ట్రేడ్ డీల్ (Trade deal) గురించి ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. “భారత్ ఇకపై రష్యా నుండి ఆయిల్ కొనబోమని అంగీకరించింది. దానికి బదులుగా అమెరికా లేదా వెనిజులా నుండి చమురును కొనుగోలు చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. మోదీ కోరిక మేరకే తాను పన్నులను 18 శాతానికి తగ్గించానని, దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి సహాయపడుతుందని ట్రంప్ తెలిపారు. అయితే ప్రధాని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్లో మాత్రం కేవలం టారిఫ్ 18 శాతానికి తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. భారత వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, ఇప్పటికీ భారత్ తన చమురు అవసరాలలో 35% రష్యా నుండే పొందుతోంది. మరి ట్రంప్ చెప్పినట్లు భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుందా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: