Air india news : Air Indiaకు చెందిన Boeing 787 Dreamliner విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లండన్లోని Heathrow Airport నుంచి బెంగళూరుకు వచ్చిన AI-132 విమానంలో ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’ సరిగా పనిచేయకపోవడం అధికారులు గుర్తించారు. ఇంజిన్కు ఇంధనం అందించే కీలక స్విచ్ ఆటోమేటిక్గా ‘కటాఫ్’ మోడ్లోకి మారుతుండటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు.
విమానం ల్యాండింగ్ అనంతరం ఇంజిన్ రీస్టార్ట్ చేసే సమయంలో ఈ లోపం బయటపడింది. సాధారణంగా స్విచ్ ‘రన్’ మోడ్లో ఉండాలి. కానీ ఇది రెండుసార్లు తనంతట తానుగా ‘ఆఫ్’ స్థితికి మారడం గమనించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెంటనే Kempegowda International Airportలో నిలిపివేశారు.
Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్లు తగ్గించిన ట్రంప్

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన తయారీ సంస్థ బోయింగ్ నిపుణులను రంగంలోకి దింపింది. ఫ్యూయల్ స్విచ్లు థ్రస్ట్ లివర్ల కింద ఉండి ఇంజిన్కు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. ఇవి యాదృచ్ఛికంగా ఆఫ్ అయితే గాల్లోనే ఇంజిన్ ఆగిపోవచ్చు. దీంతో ప్రమాదం తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన డ్రీమ్లైనర్ ప్రమాదాల నేపథ్యంలో ఈ లోపం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికుల భద్రతే ప్రధానమని, పూర్తిస్థాయిలో తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ విమానాన్ని సేవలోకి తీసుకురాబోమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ విచారణకు ఆదేశించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: