తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న తర్వాత పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్న ఓ యువతి, తన కుటుంబ సభ్యుల సహకారంతో భర్తను అమానుషంగా హత్య చేసిన ఘటన (Uttar Pradesh) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటుచేసుకుంది.
జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్గా పనిచేస్తోంది. ఆన్లైన్ జూదం వీరిమధ్య చిచ్చు రాజేసింది. జితేంద్ర తన భార్య బ్యాంక్ అకౌంట్ (Bank account) నుంచి రూ. 20,000 డ్రా చేసి ఆన్లైన్ గేమింగ్లో పోగొట్టాడు. ఈ విషయంపై జనవరి 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
Read Also: Srikakulam: ప్రియురాలి అలక ప్రియుడి ప్రాణానికి ముప్పు

కోపంతో ఊగిపోయిన జ్యోతి తన తల్లిదండ్రులు, సోదరుడిని ఇంటికి పిలిపించింది. (Uttar Pradesh) జ్యోతి తండ్రి కాళీచరణ్, తల్లి చమేలీ, సోదరుడు దీపక్ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా అదిమిపట్టారు. అదే సమయంలో జ్యోతి తన భర్త గొంతు నులిమి చంపేసింది.
హత్య తర్వాత మృతదేహాన్ని మఫ్లర్తో కిటికీ గ్రిల్కు వేలాడదీశారు. జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే, జితేంద్ర సోదరుడి అనుమానంతో పోలీసులు నిర్వహించిన పోస్ట్మార్టంలో అసలు నిజం బయటపడింది. అది ఆత్మహత్య కాదు, గొంతు నులమడం వల్ల జరిగిన హత్యని తేలింది. నిందితురాలు జ్యోతి పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: