Guntur Road Accident: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో భారీ ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరం నుండి నుదురుపాడుకు కొబ్బరి పీచు లోడ్తో వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు అకస్మాత్తుగా ఎదురువచ్చారు. వారిని తప్పించే క్రమంలో డ్రైవర్ లారీని ఒక్కసారిగా పక్క(Lorry Over turned)కు మళ్లించారు. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొని రోడ్డుపై పల్టీ కొట్టింది.
Read Also: Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై స్పందించిన చంద్రబాబు

లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడం
ప్రమాదం జరిగిన సమయంలో లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొబ్బరి పీచు బస్తాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: