కేంద్ర బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ (Commercial cylinder) ధరపై రూ.50 పెరిగింది. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1740.50కి చేరుకుంది. కోల్కతాలో రూ. 1,844.50, ముంబైలో రూ. 1,692, చెన్నైలో రూ. 1,899.50కి చేరుకున్నాయి.
Read Also: Rajasthan: ఆక్సిజన్ సిలిండర్ పేలి.. ఇద్దరు కార్మికులు మృతి
తినుబండారాల ధరలు పెరిగే అవకాశం?
గత జనవరిలో కూడా ఈ సిలిండర్లపై ఏకంగా రూ. 111 పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు నెలల పాటు ధరలు పెరగడంతో హోటళ్లు, క్యాంటీన్లు, రోడ్డు పక్కన ఉండే ఆహార దుకాణాల్లో తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది.ఒకవైపు గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, విమాన ఇంధనం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర సుమారు రూ. 91,393కు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల కారణంగా ఏటీఎఫ్ ధరను సుమారు ఒక శాతం వరకు తగ్గించారు. దీనివల్ల విమాన టికెట్ల ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: