కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్గోపాల్నాయుడి (Malla Ramgopal Naidu) కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్గోపాల్నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.
Read Also: Tirupati: ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య
2023 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరాటంలోరామ్గోపాల్నాయుడు (Malla Ramgopal Naidu) తన ప్రాణాలను పణంగా పెట్టి.. ఉగ్రవాదులకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తన తోటి సైనికుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.. ఆయన చూపిన వీరత్వం, ధైర్య సాహసాలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్గా ప్రశంసలు అందుకుంటున్నారు. జమ్మూలోని కుప్వారా జిల్లాలో జిల్లాలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం వచ్చింది.

ఆపరేషన్ను విజయవంతం
రామ్గోపాల్ నాయుడు తన సహచర సైనికులతో కలిసి సోదాలు చేపట్టారు. స్థానికుల ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైనికులను చూడగానే కాల్పులు ప్రారంభించారు. అప్పుడు రామ్గోపాల్ నాయుడు ఎంతో ధైర్యంగా, ఏమాత్రం వెనకాడకుండా ముందుకు దూకి, ముగ్గురు ఉగ్రవాదులను అతి సమీపం నుంచే కాల్చి చంపారు. ఒక ఉగ్రవాది తప్పించుకుని పారిపోవడంతో..
అతడి కోసం వెతుకుతుండగా, మిగిలిన ఐదో ఉగ్రవాది రామ్గోపాల్ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. అయితే రామ్గోపాల్ నాయుడు చాకచక్యంగా ఆ, గ్రెనేడ్ దాడి నుంచి తప్పించుకుని.. ఆ ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టి ఆపరేషన్ను విజయవంతంగా ముగించారు. తన తోటి సైనికులను రక్షించుకుంటూనే శత్రువులను మట్టుబెట్టిన నాయుడికి కీర్తిచక్ర అవార్డును ప్రకటించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నగదు బహుమతి కూడా ఇస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: