Pakistan T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. జట్టును ప్రకటించినప్పటికీ టోర్నీలో తప్పకుండా ఆడతామని చెప్పలేమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉందని పీసీబీ చైర్మన్ Mohsin Naqvi వెల్లడించారు.
ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినా పాకిస్థాన్ తన వైఖరిని (Pakistan T20 World Cup) మార్చుకోలేదని తెలుస్తోంది. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చిన నిర్ణయంపై పాక్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, అలాంటి పరిస్థితిలో వారిని ఒంటరిగా వదిలేయలేమని మొహ్సిన్ నక్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Read Also: Budget 2026: బడ్జెట్పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!

ఇటీవల టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించడంతో పాకిస్థాన్ ఆడటం ఖాయమని భావించినా, అది కేవలం జట్టుపై ప్రకటన మాత్రమేనని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. టోర్నీ మొత్తాన్ని బహిష్కరించకుండా, భారత్తో మ్యాచ్ను మాత్రమే ఆడకూడదన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉందని సమాచారం. దీంతో పాక్ పాల్గొనడంపై అనిశ్చితి మరింత పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: