మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా పాంచేవా గ్రామంలో గ్రామస్థులు తీసుకున్న ఓ తీర్మానం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.. ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా గ్రామసభలో తీర్మానం ఆమోదించడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం (Love Marriage Boycott) చేసుకున్న వారిని సామాజికంగా బహిష్కరిస్తారు. బహిష్కరించిన కుటుంబాలకు నిత్యావసరాల సరఫరా నిలిపివేసి, శుభకార్యాలకు పిలవరు. ఇప్పటికే 3 కుటుంబాలను బహిష్కరించారు.
Read Also: Smart phone: జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్..
రాజ్యాంగం ఏం చెబుతోంది?
అయితే, 18 ఏళ్లు నిండిన మహిళ, 21 ఏళ్లు నిండిన పురుషుడు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని, ఇలాంటి తీర్పులు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అయితే తాజాగా పాంచేవా గ్రామస్థుల తీర్మానానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జనపద్ సీఈఓ, స్థానిక అధికారులు పాంచేవా గ్రామాన్ని సందర్శించారు.

ఇలాంటి బహిష్కరణలు చట్టరీత్యా నేరమని, రాజ్యాంగ విరుద్ధమని గ్రామస్థులకు వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓపీ సందీప్ మాలవీయ తెలిపారు. మరోవైపు గ్రామాల్లోని ఇలాంటి మూఢాచారాలు, అక్రమ తీర్మానాలపై పోలీసులు నిఘా పెంచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: