Bhatti Vikramarka : సింగరేణి అంశంపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka తీవ్రంగా ఖండించారు. శనివారం ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ABN రాధాకృష్ణ రాసిన కథనాలు పూర్తిగా కట్టుకథలని, రాజకీయ ప్రయోజనాలతో రాసిన విషపు రాతలని విమర్శించారు.
‘తొలిపలుకు’ కాలమ్ వెనుక ఎవరి అజెండా ఉందో అందరికీ తెలుసని భట్టి వ్యాఖ్యానించారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి, కనీస అవగాహన లేకుండా కథనాలు రాయడం రాష్ట్రానికి నష్టం చేస్తోందన్నారు. తాను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత ఆశయాలతోనే పనిచేశానని, చిల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
Read Also: Prakasam district murder:లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

టెండర్ల విషయంలో స్పష్టత ఇస్తూ, సైట్ విజిట్ (Bhatti Vikramarka) నిబంధన కొత్తది కాదని, 2018 నుంచే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉందన్నారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లను సీఎం బంధువులతో ముడిపెట్టడం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రతిపక్ష నేత Harish Rao లేఖ రాస్తే చాలు… 2014 నుంచి జరిగిన అన్ని సింగరేణి టెండర్లపై SITతో విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: