ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్ వేదికగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి మరియు పెట్టుబడుల వెల్లువపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారిందని, కేవలం ఏడాదిన్నర కాలంలోనే సుమారు రూ. 23.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 16 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఉన్న స్తబ్దతను తొలగించి, పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించడం ద్వారానే ఈ స్థాయి నిధులను ఆకర్షించగలిగామని, ఇది రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆయన వివరించారు.
BJP national president : బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని లోకేశ్ కొనియాడారు. ఐటీ (IT), క్వాంటం కంప్యూటింగ్, మరియు కృత్రిమ మేధ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో చంద్రబాబు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అబివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదని, భవిష్యత్ తరాలకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ కారణంగానే దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని పారిశ్రామిక వర్గాలకు వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తాము కష్టపడుతుంటే, మరోవైపు రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు (వైసీపీని ఉద్దేశిస్తూ) పెట్టుబడులు రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న “11 మంది ఏడుపుగొట్టు టీమ్” రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com